ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుInational highway in AP is four lanes:ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి. కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ 167ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి. ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్టులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల పనులు చేపట్టారు.
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుInational highway in AP is four lanes
ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి. కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ 167ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి. ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్టులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల పనులు చేపట్టారు. ప్రస్తుతం చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. 167ఏ హైవేలో వాడరేవు – పిడుగురాళ్ల వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తోంది.. ఈ మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణాకు ఉపయోగంగా ఉంటుంది. ఈ మేరకు మోటుపల్లి, పెద్దగంజాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉండడం కూడా కలిసొస్తుంది అంటున్నారు. ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులువు అవుతుంది. చీరాల ప్రాంతంలో వాడరేవు ఉండడంతో పర్యాటన రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. వాణిజ్య వ్యాపారాల సైతం హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఈ హైవే హైదరాబాద్ (అద్దంకి- నార్కెట్పల్లి)కు కూడా కనెక్ట్ అవుతోంది.
నేషనల్ హైవే 167-A విస్తరణ ప్రాజెక్ట్ వాడరేవు-పిడుగురాళ్ల మధ్య నాలుగు లేన్లుగా చేపట్టారు. 85 కిలోమీటర్లకుపైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1,064.24 కోట్ల వ్యయం అవుతోందని అంచనా వేశారు. నెకరికల్లు దగ్గర అద్దంకి-నార్కెట్పల్లి రోడ్, చీరాల దగ్గర నేషనల్ హైవే 216, చిలకలూరిపేట దగ్గర నేషనల్ హైవే 16కి అనుసంధానం చేస్తున్నారు. వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలో మీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట దగ్గర బైపాస్లు ఉంటాయి. ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల-ఓడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ.. ట్రాఫిక్ తగ్గించడానికి, కనెక్టివిటీ మెరుగుపర్చడానికి బైపాస్లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు ఉన్నాయి. మరోవైపు ఈ 167ఏ వాడరేవు-పిడుగురాళ్ల హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ సర్వే మొదలైంది. భూసేకరణ కూడా నరసరావుపేట బైపాస్ మినహా మిగతా అన్నిచోట్లా పూర్తికాగా.. అలైన్మెంట్ మార్చాలని కొందరు రైతులు కోరారు. కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. డీపీఆర్కు అనుగుణంగానే కేసానుపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళ్తున్నారు. ఈ మేరకు సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో మరో హైవే నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. పలమనేరు- కుప్పం హైవేకు సంబంధించి ప్రస్తుతం అధికారులు డీపీఆర్ను తయారు చేస్తున్నారు.. సర్వే కూడా జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు నేషనల్ హైవే 42ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. పలమనేరు నుంచి కుప్పం వరకు హైవే రెండు వరుసలుగా ఉంది.. ఇప్పుడు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయబోతున్నారు. బైరెడ్డిపల్లె, వీ కోట బైపాస్లకు భూసేకరణతోపాటు తొమ్మిది కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి రూ.వంద కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తవ్వగా, వీ కోటలో మాత్రం ఆగిపోయింది.. ఈ బైపాస్ పనులకు టెండర్ ఖరారు చేశారు.. అధికారులు భూసేకరణ పూర్తి చేయగానే ఆ కాంట్రాక్ట్ సంస్థ పనుల్ని ప్రారంభించనుంది. పలమనేరు- కుప్పం హైవేకు సంబంధించి బైరెడ్డిపల్లె, వీ కోట ప్రాంతాల్లో బైపాస్ల విషయానికి వస్తే.. వీ కోటలో బైపాస్ మార్పు కోసం స్థానికులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్టే విధించారు. ఈ కారణంగా పనులు ఆగిపోయాయి. అయితే ఇప్పటికే రూ.22 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేస్తుండగా.. రూ.99 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. చిత్తూరు- తచ్చూరు, చెన్నై- బెంగళూరు నేషనల్ హైవే పనులు కూడా కొసాగుతున్నాయి. అలాగే కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు మరో 20 కిలోమీటర్ల వరకు ఈ హైవేను మొత్తం 84 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు ఈ హైవేను భూసేకరణతో కలిపి రూ.1,500 కోట్ల అంచనా వ్యయమని చెబుతున్నారు. డీపీఆర్ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో వ్యయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ పలమనేరు – కుప్పం రహదారి నాలుగు లైన్ల అభివృద్ధిలో మూడు చోట్ల బైపాస్లు రానున్నాయి.. శాంతిపురం, రాజుపేట, కుప్పం ఏరియాలో బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అలాగే బైరెడ్డిపల్లె, వి.కోట ప్రాంతాల్లో బైపాస్ నిర్మాణానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చింది.